10-06-2025 09:52:14 AM
మంథని లో విలేకరుల సమావేశంలో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు
ఈ సంఘటన తెలుసుకున్న రాష్ట్ర మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ఘటనస్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇచ్చి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని, ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. రెడ్డి చెరువులో మట్టి తీసి డబ్బులు అక్రమంగా వసూలు చేస్తున్నారని అసత్య ఆరోపణలు చేయడం కాదని, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే రుజువు చేయాలని సవాల్ విసిరారు. మా నాయకులపై అసత్యపు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దొరగోళ్ళ శ్రీనివాస్, దాది క్రాంతి, ఎరుకల సురేష్ పాల్గోన్నారు.