10-06-2025 09:55:22 AM
జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనీనా
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా. ఈనెల 10వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించే "అమ్మ మాట అంగనవాడి బాట" కార్యక్రమంలో(Amma Mata-Anganwadi Bata) అంగనవాడి టీచర్ల నుండి సిడిపిఓల వరకు క్షేత్రస్థాయిలో భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లేనినా ఆదేశించారు. కార్యక్రమం వివరాలను ఆమె వెల్లడించారు. ముందుగా అంగన్వాడి కేంద్రాలన అహలోదకరమైన వాతావరణంలో ఉండే విధంగా చూడాలన్నారు. పెరటి తోటలు పచ్చదనంపై శ్రద్ధ పెట్టి మొదటి రోజు వచ్చే పిల్లల తల్లితండ్రులతో అంగన్వాడి కేంద్రాలలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసుకొని ఫోటో దిగే విధంగా చర్యలు తీసుకోని, కార్పొరేట్ విద్యాసంస్థలకు అతీతంగా విద్యా బోధన అందిస్తున్న విధానంపై తల్లితండ్రులకు అవగాహన కల్పించాలన్నారూ.మూడు సంవత్సరాల పైబడిన పిల్లలను చేర్పించే విధంగా గ్రామ, పట్టణ స్థాయిలో స్వయం సహాయక గ్రూప్ సభ్యులు పిల్లల తల్లితండ్రులచే అవగాహన ర్యాలీలు నిర్వహించాలని, తదుపరి "స్వచ్ అంగనవాడి"లో భాగంగా అంగన్వాడి కేంద్రాలను శుభ్రపరచుకొని అంగన్వాడి కేంద్రానికి వచ్చే చిన్నారులకు పోషక విలు అంగనవాడి కేంద్రాలలో పోషణ వాటికలు ఏర్పాటు చేసి అంగన్వాడి కేంద్రాలకు వచ్చే పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పోషకాహార విలువలను పెంపొందించాలన్నారు.
అంగనవాడి కేంద్రాలలో బోధిస్తున్న పూర్వ ప్రాథమిక విద్యపై తల్లితండ్రులకు వివరిస్తూ, క్రీడా నైపుణ్యతతో కూడిన విద్యను ఏ విధంగా అనుసరించాలో తెలియపరచాలన్నారు. గ్రామా పట్టణాలలో ఉన్న ప్రతి ఒక్క అంగనవాడి కేంద్రాలలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించి అట్టి కార్యక్రమానికి పిల్లల, తల్లితండ్రులు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. సామూహిక అక్షరాభ్యాసానికి ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. అంగన్వాడి కేంద్రాలలో పిల్లలు ఎవరైతే శారీరకంగా దృఢంగా ఉండి క్రమం తప్పకుండా హాజరవుతూ విద్యాభ్యాసంలో ముందంజలో ఉంటారో వారి తల్లితండ్రులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయాలన్నారు., అంగన్వాడి కేంద్రాలలో మౌలిక సదుపాయాలు అయినటువంటి విద్యుత్ సరఫరా నీటి సరఫరా, ప్రీ స్కూల్ కిట్, ఇప్పటికే సిద్ధంగా ఉంచామని,తప్పకుండా అంగన్వాడి కేంద్రాలలో పిల్లల ఎత్తు బరువులు క్రమం తప్పకుండా చూస్తూ వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు పై తల్లితండ్రులకు వివరించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అప్లికేషన్లలో నమోదు చేస్తూ పోషణ లోపం లేకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్క అంగన్వాడి టీచర్ పై ఉందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన :ఇందిరమ్మ అమృతం" పథకం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన జిల్లాలో లాంఛనంగా ప్రారంభించడం జరిగిందని ఎవరైతే అంగన్వాడి కేంద్రాలలో 14 నుండి 18 సంవత్సరాల మధ్య నమోదైనటువంటి కిశోర బాలికలకు క్రమం తప్పకుండా అందజేస్తూ రక్తహీనత రహిత తెలంగాణ కోసం పాటుపడాలని కోరారు.