10-06-2025 01:44:01 AM
నూతన కార్యవర్గం ఏర్పాటు
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ శ్రేణులు, ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీసీసీ కార్య వర్గ ప్రకటన రానే వచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్ సోమవారం రాత్రి 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులతో కూడిన జాబితా ప్రకటించారు.
కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ అ యిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. పదవుల పంపకాల్లో అధిష్ఠానం సామాజిక న్యా యానికి ప్రాధాన్యమిచ్చినట్లు కనిపిస్తున్నది. అలాగే పార్టీ మహిళా నేతలు, ప్రజా ప్రతిని ధులకూ ప్రాతినిధ్యం కల్పించినట్లు స్పష్టమవుతున్నది. 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీలు 8 మంది, ఎస్సీలు ఐదుగురు, ఎస్టీలు ఇద్ద రు, ముస్లింలు ముగ్గురు.
దీంతో ఉపాధ్యక్ష పదవుల్లో 67 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కట్టబెట్టినట్లయింది. 69 ప్రధాన కార్యదర్శి పదవుల్లో అత్యధికం గా బీసీలు 26. ఎస్సీలు తొమ్మిది మంది, ఎ స్టీలు నలుగురు, ముస్లింలు ఎనిమిది మం ది. అధిష్ఠానం అలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా ర్టీ వర్గాలకు 68 శాతం పదవులు కట్టబెట్టింది.
ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవు లు దక్కించుకున్న వారందరూ పార్టీలో సీనియర్లేనని, వారు రెండు దశాబ్దాల నుంచి పా ర్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నవారేనని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. వీరి లో ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్లో సేవలందించిన వారూ ఉండటం విశేషం. పార్టీ అధిష్ఠానం త్వరలోనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ప్రకటిస్తుందని సమాచారం.
ప్రధాన కార్యదర్శులు వీరే..
పీసీసీ ప్రధాన కార్యదర్శులుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, సీహెచ్ పర్ణికారెడ్డి, మట్టా రాగమయి, పార్టీ నేతలు సీఎచ్ రాంభూపాల్, ఏ సంజీవ్ ముదిరాజ్, బొజ్జ సంధ్యా రెడ్డి, మల్లాడి రామిరెడ్డి, ఏ సదాలక్ష్మి, ఎం బేబీ స్వర్ణకుమారి, దర్గాసింగ్ తాండ్రు, శశికళా యాదవ్రెడ్డి, కత్తి వెంకటస్వామి, ఎండీ అబ్దూల్ ఫహీం, సంతోశ్కుమార్ రుద్ర, దుగ్గం భాస్కర్, మహ్మద్ ఖాజా ఫక్రూద్దీన్, వీ జగదీశ్వర్ గౌడ్, నరేశ్జాదవ్, అల్లం భాస్కర్, గిరిజా షెట్కార్, కొప్పుల ప్రవీణ్కుమార్, ఏ జంగారెడ్డి, కే శ్రీనివాస్రావు, దుద్దిళ్ల శ్రీనుబాబు, బద్దం ఇంద్రకరణ్రెడ్డి, చనగాని దయాకర్, పీసరి మహిపాల్రెడ్డి, గజ్జెల కాంతం, ఏడుపుగంటి సుబ్బారావు, చకిలం రాజేశ్వరరావు, ఈర్ల కొమురయ్య, రవిబాబు, నాగా సీతారాములు, సానెం శ్రీనివాస్గౌడ్, పృథ్వీచౌదరి, అంబటి రాజేశ్వర్, డీడీ వెంకట్రాజు, బీ ప్రభాకర్రెడ్డి, పల్లె శ్రీనివాస్ గౌడ్, ఎండీ షబ్బీర్అలీ, కాట్ల రంగారావు, ఎం సత్యనారాయణగౌడ్, తోపాజి అనంతకృష్ణ, వీ రామారావు గౌడ్, అచ్యుత రమేశ్బాబు, బాలమురళీకృష్ణ, ఎం రాజీవ్రెడ్డి, అడం రాజు, షామీన్ ఆగా, ఈవీ శ్రీనివాస్రావు, మిథన్రెడ్డి, వెంకటేశ్ పవార్, రాయగిరి కల్పనా యాదవ్, రెహమత్ హుస్సెనీ, ప్రసన్నకుమార్ శర్మ, ఎండీ షాబుద్దీన్, నడిమళ్ల యాదయ్య ముదిరాజ్, దైద రవీందర్, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గడ్డం చంద్రశేఖర్రెడ్డి, జీ నాగభూషణం, ఉపేందర్రెడ్డి, ధర్మారావు, నూతి సత్యనారాయణ గౌడ్, దుర్గాప్రసాద్, వెంకట గోవిందరావు, పీ శ్రీనివాసులురెడ్డిని అధిష్ఠానం ఎంపిక చేసింది.
పీసీసీ ఉపాధ్యక్షులు వీరే..
పీసీసీ ఉపాధ్యక్షులుగా నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డి, ఎమ్మె ల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, చిక్కు డు వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్ , బస్వరాజు సారయ్య, పార్టీ నేతలు టీ కుమార్రావు, కొండేటి మల్లయ్య, కొండు పుష్పలీల, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కోట నీలిమ, బండి రమేశ్, బీ కైలాస్కుమార్, ఆత్రం సుగుణ, గాలి అనిల్కుమార్, నమిండ్ల శ్రీనివాస్, చీతల సత్యనారాయణ, లకావత్ ధనవంతి, ఎంవీ గౌడ్, కోమటిరెడ్డి వినయ్రెడ్డి, ఎంఏ ఫహీం, బొంతు రామ్మోహన్, ఎస్ సురేశ్కుమార్, అప్సర్ యూసఫ్జాయి, ఎస్ జగదీశ్వర్రావు, నవాబ్ ముజాహిద్ అలంఖాన్, గుమ్ముల మోహన్రెడ్డి, సీఎచ్ సంగమేశ్వర్ను అధిష్ఠానం ఎంపిక చేసింది