calender_icon.png 9 October, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలను పరామర్శించిన పుట్ట మధు

09-10-2025 12:00:00 AM

కాటారం, అక్టోబర్ 8, (విజయక్రాంతి) : కాటారం మండలంలోని పలు గ్రామాలలోనీ బాధిత కుటుంబాలను బుధవారం మంథని మాజీ ఎంఎల్ ఏ పుట్ట మధుకర్ పరామర్శించారు. దామరకుంట గ్రామంలో జిల్లెల పెద్ద రాజలింగన్న, విలాసాగర్ లో రోడ్డబోయిన లక్ష్మి, దేవరంపల్లి లో రెబ్బ రాజ మల్లక్క వివిధ కారణాలతో చనిపోవడంతో వారి కుటుంబాలను  పరామర్శిం చారు. ఆయన వెంట బి ఆర్ ఎస్ నాయకులు జోడు శ్రీనివాస్, రామిళ్ళ కిరణ్, కుడుదుల రాజబాపు, వుర వెంకటేశ్వరరావు, కొండ గొర్ల వెంకటస్వామి, బాసాని రవి, జక్కు శ్రావణ్, మానెం రాజబాబు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.