calender_icon.png 29 June, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్య క్షేత్రం భద్రాద్రిలో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో మాజీప్రధానిభారత రత్న పీ.వీ జయంతి వేడుకలు

29-06-2025 12:00:19 AM

జిల్లా కలెక్టర్ ఆఫీసులలో పివి కాంస్య విగ్రహాలు ప్రతిష్టించాలి

అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పీవీ జయంతి వర్ధంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలి

బ్రాహ్మణ సంఘాల విజ్ఞప్తి

భద్రాచలం,(విజయక్రాంతి): బహుబాషా కోవిధులు భారత మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి వేడుకలు భద్రాద్రి బ్రాహ్మణ పురోహితసంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామా వజ్జల. రవికుమార్ శర్మ ప్రసంగిస్తూ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని, భారతదేశం అన్ని విధాల ఆర్థిక ఇబ్బందులలో ఉండి మన బంగారాన్ని విదేశీ బ్యాంకులలో హామీగా ఉంచి అప్పులు తెస్తున్న ఆ సమయంలో భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ పి. వి అమేయమైన తన మేధాశక్తితో నూతన ఆర్థిక, పారిశ్రామిక , వ్యవసాయ, విదేశాంగ విధానాలను ప్రవేశపెట్టి అప్పు లలో ఉన్న మన దేశాన్ని అగ్రదేశాలతో పోటీపడే విధంగా భారత్ ను తీర్చిదిద్దారని, విదేశీ బ్యాంకులలో ఉన్న మన బంగారాన్ని విడిపించి ప్రజలచే జేజేలు పలికించుకున్నారని రవికుమార్ శర్మ పేర్కొన్నారు. 


ఈరోజు మన దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుటకు స్వర్గీయ పీవీ ప్రవేశపెట్టిన విధానాలే కారణమని తెలిపారు. వ్యక్తిగత స్వార్థం లేకుండా కేవలం దేశ0 అభివృద్ధి కోసమే కృషిచేసి ప్రపంచ దేశాలు భారత వైపు చూసేలా నూతన విధానాలు ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని భారతరత్న శ్రీ పి. వి కాంస్య విగ్రహాలను ఉభయ తెలుగు రాష్ట్రాల జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ప్రతిష్టించాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో మాజీ ప్రధాని శ్రీ పి వి జయంతులు, వర్ధంతిలు అధికారికంగా నిర్వహించాలని రవికుమార్ శర్మ కోరారు.