calender_icon.png 29 June, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్ ఫామ్ తోటలకు రైతులను ప్రోత్సహించాలి

29-06-2025 12:03:39 AM

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి

కొండపాక: ఆయిల్ ఫామ్ తోటలకు రైతులను ప్రోత్సహించి, నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అధికారులు కృషి చేసి రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి  అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐడిఓసి సమావేశ భవనంలో శనివారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి మాట్లాడుతూ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, వారికి నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి, జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటల సాగు పెరిగేలా రైతులను ప్రోత్సహించి, ఓకే తరహా పంటలు కాకుండా కోకో వివిధ రకాల అంతర పంటలు వేసేలా చూడాలని, రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనులను అధికారులు పర్యవేక్షించాలని, మండల స్థాయిలో పెండింగ్ లొ ఉన్న లక్ష్యాలను జూలై 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో రైతులను ప్రోత్సహించాలని అన్నారు. ఉద్యాన దర్శిని అనే పుస్తకాన్ని కలెక్టర్ కె హైమావతి చేతుల మీదుగా ఆవిష్కరించారు.