11-09-2025 01:19:41 AM
ఆర్టీసీలో ఆన్లైన్ సేవలతో జేబుకు చిల్లు
సంగారెడ్డి, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) :రమేశ్ (పేరు మార్చాము) అనే ప్రయాణీకుడు ప్రతిరోజు సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగ రీత్యా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఉంటా డు. ఎప్పటిలాగే బస్సులో టికెట్ ఖరీదు రాగా ఆన్ లైన్ పేమెంట్ చేశాడు. డబ్బులు తన అకౌంట్ నుంచి డ్రా అయినట్లు ఫోన్కు మెసేజ్ వచ్చింది. అయితే మిషన్లో సాంకేతిక సమస్య కారణంగా టికెట్ రాలేదు. దీంతో కండక్టర్ డబ్బులు చెల్లించి టికెట్ తీసుకోవాలన్నాడు.
ఆన్లైన్ పేమెంట్ తిరిగి వస్తాయని చెప్పాడు. చేసేది లేక డబ్బు లిచ్చి టికెట్ తీ సుకున్నాడు. కానీ తిరిగి ఆ డబ్బులు జమ కాలేదు. చాలా మంది అవి రావని చెబుతున్నారు. ఇలా చాలా మంది క్యూ ఆర్ కోడ్ తో ఇబ్బందులకు గురవుతున్నట్లు సమాచా రం. ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్ స్కానర్ ద్వా రా డబ్బులు చెల్లిస్తున్న ప్రయాణీకులకు జే బులకు చిల్లుపడుతుంది.
ఆన్లైన్ పేమెంట్ అ యినా మిషన్ నుంచి టికెట్ రాకపోవడంతో నష్టపోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఆ సమయంలో చేతిలో డబ్బులు లేకపోతే దిగిపోమ్మంటూ కండక్టర్లు చెప్పేస్తున్నారని పలువు రు ప్రయాణికులు వాపోతున్నారు. ప్రభు త్వం మాత్రం ఆర్టీసీలో నగదు రహిత సౌల భ్యం కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్నా తరచూ ఇలాంటి ఫిర్యాదులు వస్తుండటం గమనార్హం.
ఐ-టిమ్ ద్వారా..
ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలు రా ష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇందుకోసం చలో కంపెనీ నుంచి ఐ-టిమ్ మిషన్లు పంపిణీ చేశారు. సంగారెడ్డి రీజియన్ లో గత ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది. ఏసీ బస్సులు మొదలుకుని సూపర్ లగ్జరీ, ఎ క్స్ప్రెస్, పల్లె వెలుగుల్లోనూ అమలుపర్చా రు. రీజియన్ పరిధిలోని ఆయా డిపోల్లో మొత్తం సుమారు 600 వరకు మిషన్లు ప్ర స్తు తం పని చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే అత్యధిక మిషన్లలో సాం కేతిక సమస్యలు తలెత్తుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ద్వారా డ బ్బులు స్కాన్ చేస్తున్న ప్రయాణికులకు చుక్కెదురవుతుంది. డబ్బులు అకౌంట్ నుంచి కట్ అవుతున్నా టికెట్ మాత్రం జనరేట్ కా వడం లేదు.
దీంతో ప్రయాణీకులు కండక్టర్లను ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో వివాదా లు సైతం చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా సిగ్నల్ వీక్ ఉన్నచోట ఇవి పని చేయడం లేదనే విమర్శలున్నాయి. అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం ఆ డబ్బులు తిరిగి వస్తాయని చెబుతున్నారు.
పరిశీలన చేస్తాం..
టిమ్ మిషన్ల పరంగా ప్రయాణికులు వ్యక్తం చేస్తున్న ఈ సమస్యపై పరిశీలన చేస్తాం. ఒకవేళ అకౌంట్లో నుంచి డబ్బు లు డ్రా అయిన పక్షంలో కండక్టర్లను గానీ, డిపో మేనేజర్ను సంప్రదించాలని, తద్వారా 24 గంటల్లో ఆ ప్రయాణికులకు డబ్బులు తిరిగి వచ్చేలా చేస్తున్నాం. సాంకేతిక సమస్యలుంటేపరిష్కరిస్తాం.
విజయభాస్కర్, ఆర్టీసీ ఆర్ఎం, సంగారెడ్డి