ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య: కలెక్టర్
25-03-2026 01:37 AM
నిర్మల్, మార్చి 2౪ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని చక్కగా చదువుకొని భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం సారంగాపూర్ మండలంలోని చించోలి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు.
వంట గదులు స్టాక్ రిజిస్టర్ హాజరు పట్టిక తరగతి గదిలో విద్యాబోధన రైతు అంశాలను స్వయంగా పరిశీలించారు. పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యాహ్న భోజన కార్మికులతో మాట్లాడారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డి ఈ ఓ భోజన్న మండల విద్యాశాఖ అధికారులు రెవిన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.




