13-06-2025 12:24:36 AM
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): దసరా పండుగకు తెలంగాణ మహిళలకు ఇచ్చే బతుకమ్మ చీరలకు గత ఏడేండ్లలో రూ. 2,148.45 కోట్లను కేటాయించారు. 2017-18 నుంచి 2023-24 సంవత్సరం వరకు ఈ నిధులను విడుదల చేశారు. సమాచార హక్కు చట్టం కింద యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి అడిగిన వివరాలను సంబంధిత అధికారులు సమాచారమిచ్చారు.
అయి తే బతుకమ్మ చీరల టెండర్, వాటిని ఎక్కడ తయారు చేశారో అనే వివరాలను మాత్రం టెస్కో నుంచి పొందా లని ఈమేరకు అధికారులు పేర్కొనడం గమనార్హం. బతుకమ్మ చీరల ఖర్చుపై విచారణ చేపట్టాలని యూ త్ఫర్ యాంటీకరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటీ ఈమేరకు డిమాండ్ చేశారు. ఖర్చు చేసిన డబ్బులన్నీ ఏం చేశారో అర్థం కావడంలేదని ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.