04-06-2025 12:36:12 AM
ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం కార్యక్రమం ప్రారంభం
చండూరు, జూన్ 3: నాణ్యమైన విత్తనం- రైతన్నకు నేస్తం కార్యక్రమం లో భాగంగా మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురు రైతుల చొప్పున వరి , పెసర మినీకిట్స్ ను మండల వ్యవసాయ అధికారి చందన,చండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోలు వెంకట్ రెడ్డి లు రైతులకు అందజేశారు.
ఇందులో భాగంగా 32 మంది రైతులకు వరి ( 10 కేజి), 16 మంది రైతులకు పెసర (3 కేజీ) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు భూతరాజు ఆంజనేయులు, నలపరాజు రామలింగయ్య , సొసైటీ డైరెక్టర్ కట్ట భిక్షం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొరిమి ఓంకారం, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
చౌటుప్పల్..
చౌటుప్పల్, జూన్ 3(విజయక్రాంతి): చౌటుప్పల్ మండలం కుంట్ల గూడెం రైతు వేదిక నందు ఆచార్య (ప్రొఫెసర్) జయశంక ర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనాలు అను కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మరియు సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి ప్రతి గ్రామా నికి నాణ్యమైన విత్తనం కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మండలాల్లోని ఎంపి క చేయబడిన ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురు రైతుల గానూ 10 కిలోల వరి విత్తనo కేఎన్ఎం-1638 సన్నరకం 3 కిలోల పెసర విత్తన ఎం జి జి -385 కిట్లను అందజేశారు.
అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలను సరైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడి పొందాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ సరఫరా చేసిన వరి,పెసర విత్తనాలు సాగు యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఒక రైతు నుంచి మిగతా రైతులు కొనే విధంగా నాణ్యమైన విత్తనాల తయారు చేసి రైతులకు ఇవ్వాలని కోరారు. వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజయ్య , మార్కెట్ కమిటీ డైరెక్టర్ సప్పిడీ సంజీవ రెడ్డి, వివిధ క్లస్టర్ల వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలను అరికట్టాలి
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూన్3: నకిలీ విత్తనాలను అరికట్టి ప్రభుత్వమే రైతులకు ఉచితంగా విత్తనాలు,ఎరువులను అందించాలని అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ కోరారు.మంగళవారం మండల కేంద్రం అర్వపల్లిలోని తహశీల్దార్ కార్యాలయంలో ఆ సంఘం ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యుటీ తహశీల్దార్ యాదగిరికి అందజేశారు. ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య,పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్, రైతుసంఘం నాయకులు పగిడిమర్రి సోమయ్య, ధర్మాజీ, నర్సయ్య, సంజీవ తదితరులు ఉన్నారు.
నాణ్యమైన విత్తనంపై అవగాహన
చివ్వేంల, జూన్ ౩: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనం-రైతన్నకు నేస్తం అంశంపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవి ద్యాలయం రాజేంద్రనగర్ మొక్కజొన్న ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భద్రు నాయక్ రైతులకు పలు సలహాలు ఇచ్చారు.
ప్రతి గ్రామంలో విత్తన స్వయం సమృద్ధి సాధించ డమే కాకుండా తెలంగాణ రాష్ట్రం విత్తన ఉత్పత్తిలో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్ర మంలో మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు, సూర్యాపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీరన్న నాయక్, టెక్నీకల్ వ్యవసాయ అధికారి N.ప్రణవి, వ్యవసాయ విస్తరణ అదికారులు ప్రియాంక, శైలజ, వెంకట్ రెడ్డి రైతులు ఫాల్గొన్నారు.
నాణ్యమైన విత్తనం ప్రతి రైతుకు..
వలిగొండ,జూన్3 (విజయ క్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నాణ్యమైన విత్తనం ప్రతి రైతుకు అనే కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి అంజనీ దేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు అలాగే మిగతా రైతులకు అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మరియు తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించాన్నారు.
అనంతరం వరి రకము కే ఎన్ ఎం 1638 కిట్లు 60 మరియు పెసర్లు డబ్ల్యూ జి జి 30 కిట్లు రైతులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సయ్యద్ అహ్మద్ హుస్సేన్, ఏడిఏ వెంకటేశ్వరరావు, క్లస్టర్ ఏఈఓలు రైతులు నరేందర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి పాశం సత్తిరెడ్డి, బత్తిని సహదేవ్ మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు.