04-06-2025 12:35:45 AM
హనుమకొండ, జూన్ 3 (విజయ క్రాంతి): తాజాగా ఎన్ టి ఏ విడుదల చేసిన జేఈఈ అడ్వానస్డ్ ఫలితాల్లో రేజోనన్స్ వరంగల్ అద్భుతమైన ర్యాంకులతో తమ విద్యార్థులను దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలో ప్రవేశానికి మార్గం సుగమనం చేసుకుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దాదాపు 61 మందికి పైగా ఐఐటీ సీట్లు పొందే అవకాశం ఉందని రేజోనెన్స్ చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి ఫౌండేషన్ కోచింగ్ లేకుండానే తమ విద్యార్థులు వి.శశి కౌశిక్ (256004178) ఏఐఆర్ 401, బి.సాహితీ (256145060) ఏ ఐ ఆర్ 642, సౌమ్య (256193 025) ఏఐఆర్ 659, అనిరుద్ (256162075) ఏఐఆర్ 714, శరన్ (2561 77151) ఏ ఐ ఆర్ 750, హృదయ్ (256199036) ఏ ఐ ఆర్ 810, సిద్దు (256195040) ఏ ఐ ఆర్ 833, ఎం చరణ్ తేజ (256194155) ఏఐఆర్ 854, బి.ఉమేష్ చంద్ర (256198086) ఏఐఆర్ 941, ర్యాంకులతో పాటు చాలామంది తమ విద్యార్థులు ఆశించిన అడ్వాన్సుడ్ ర్యాంకులను సాధించారని వివరించారు.
మొత్తంగా 9 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు పదుల సంఖ్యలో విద్యార్థులు 2000 లోపు ర్యాంకులు, మొత్తంగా 61 మంది విద్యార్థులు దేశంలోని వివిధ ఐఐటీలలో సీట్లు సాధించే అవకాశం ఉందని సంతోషం వ్యక్తపరిచారు. పట్టణ ప్రాంత విద్యార్థులతో పాటు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సాధారణ స్థాయి నుండి వచ్చి తమ శిక్షణలో తమను తాము అద్భుతంగా మలుచుకొని జేఈఈ అడ్వాన్సుడు ఫలితాల్లో ప్రతిభ చూపడం చాలా గర్వకారణమని తెలిపారు. వారందరూ మంచి భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లెక్కల రాజిరెడ్డి, డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సిఏఓ లెక్కల రమ్మ రాజిరెడ్డి పాల్గొన్నారు.