calender_icon.png 8 June, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా నైపుణ్యం, పరిశోధనల్లో అగ్రగామి ఎస్సార్ యూనివర్సిటీ

04-06-2025 12:39:16 AM

 6న మూడవ స్నాతకోత్సవం, ఘనంగా ఏర్పాట్లు

వరంగల్, జూన్ 3 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో 2020 లో ప్రైవేట్ యూనివర్సిటీగా స్థాపించబడిన ఎస్సార్ యూనివర్సిటీ విద్యా నైపుణ్యం, పరిశోధన ఆవిష్కరణలో శరవేగంగా అగ్రగామిగా నిలుస్తోంది. 2002 ఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజీ గా స్థాపించబడి న్యాక్, ఎన్బీఏ యూజీసీ గుర్తింపు పొంది 23 సంవత్సరాల గొప్ప వారసత్వాన్ని కలిగి ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌ఆర్ యూనివర్సిటీ ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రతిష్టాత్మక ఎస్‌ఆర్ యూనివర్సిటీలో తన 3వ స్నాతకోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.

ఈ కార్యక్రమం 2025, జూన్ 6వ తేదీ శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో జరగనుంది. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఎస్‌ఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారు (క్యాబినెట్ ర్యాంక్), ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ జి. సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు.

డాక్టర్ రెడ్డి రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం మాజీ కార్యదర్శిగా, డీఆర్డీఓ మాజీ ఛైర్మన్గా, రక్షణ శాఖ మంత్రికి మాజీ శాస్త్రీయ సలహాదారుగా విశేష సేవలందించిన ప్రముఖ వ్యక్తి అని తెలిపారు. ఈ కార్యక్రమానికి మరింత శోభను చేకూరుస్తూ, భారతీయ సినిమా,  ప్రపంచ సంగీతానికి చేసిన విశేష కృషికి గాను ప్రఖ్యాత సంగీత స్వరకర్త, గాయకుడు, గేయ రచయిత ఎం. ఎం. కీరవాణికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో 2020లో ప్రైవేట్ యూనివర్సిటీగా స్థాపించబడిన ఎస్‌ఆర్ యూనివర్సిటీ విద్యా నైపుణ్యం, పరిశోధన మరియు ఆవిష్కరణలలో శరవేగంగా అగ్రగామిగా నిలిచింది. గతంలో ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ 2002లో స్థాపించబడి,  యూనివర్సిటీగా గుర్తింపు పొంది, నాక్ , ఎన్బీఏ, యూజీసీ నుండి ప్రతిష్టాత్మక గుర్తింపులను పొంది, 23 సంవత్సరాల గొప్ప వారసత్వాన్ని కలిగి ఉందన్నారు.

ఎస్‌ఆర్ యూనివర్సిటీ సాధించిన ముఖ్య విజయాలలో ఎన్‌ఐఆర్‌ఎఫ్ 2024 ర్యాంకింగ్స్లో 98వ స్థానం సాధించడం, గత మూడు సంవత్సరాలుగా భారతదేశంలోని టాప్ 100 సంస్థలలో నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ (ఏ ఆర్ ఐ ఐ ఏ) 2020లో ఎస్ ఆర్ యూనివర్సిటీ నంబర్ 1 ప్రైవేట్ సంస్థగా ర్యాంక్ పొందిందని చెప్పారు. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ (టిహెచ్‌ఇ) ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ ర్యాంకింగ్స్ 2025లో, ఎస్‌ఆర్ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా 401500 బ్యాండ్లో, భారతదేశం నుండి కేవలం 65 సంస్థలలో ఒకటిగా నిలిచిందన్నారు.

టీహెచ్‌ఈ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2024లో, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ (ఎస్ డి హెచ్ 8) లో భారతదేశంలో 2వ స్థానం, రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్ (ఎస్ డి జి 12) లో 16వ స్థానం, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ (ఎస్ డి జి 7) లో 47వ స్థానం,  క్వాలిటీ ఎడ్యుకేషన్ (ఎస్ డి జి4) లో 60వ స్థానం సాధించిందన్నారు. యూఐ గ్రీన్ మెట్రిక్ ర్యాంకింగ్స్ 2024లో తన సుస్థిరత కార్యక్రమాలకు గాను ఎస్ ఆర్ యూనివర్సిటీ భారతదేశంలో 25వ స్థానం, ప్రపంచ వ్యాప్తంగా 743వ స్థానం పొందిందన్నారు.

తెలంగాణలో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ స్థాపించిన మొదటి ప్రైవేట్ యూనివర్సిటీ కూడా ఎస్‌ఆర్ యూనివర్సిటీనే, ఇది 110కి పైగా స్టార్టప్లకు మద్దతు ఇచ్చిందన్నారు. ఈ సంస్థ 51 లక్షల రూపాయల అత్యధిక వార్షిక ప్లేస్మెంట్ ప్యాకేజీని కలిగి ఉందని,  ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థలు, పరిశ్రమలతో అనేక సహకారాలు అవగాహన ఒప్పందాలను(ఎం ఓ యు) కలిగి ఉందన్నారు.

ఈ స్నాతకోత్సవంలో అధికారిక విద్యా ఊరేగింపు, గౌరవ డిగ్రీల ప్రదానం, గ్రాడ్యుయేట్లకు పతకాలు, డిగ్రీల పట్టాలు అందజేతతో పాటు అనేక వేడుకలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి గ్రాడ్యుయేట్ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు, ప్రముఖులు, కుటుంబాలతో సహా 3,000 మందికి పైగా హాజరవుతారని వైస్ చాన్సలర్ తెలిపారు. ఈ సమావేశంలో  వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి. మహేష్, రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్. అర్చనా రెడ్డి, స్నాతకోత్సవ ప్రణాళికలో పాలుపంచుకున్న కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.