ఈడీ రెగ్యులర్ డైరెక్టర్గా రాహుల్
15-08-2024 12:51 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలిక డైరెక్టర్గా ఉన్న రాహుల్ నవీన్ను రెగ్యులర్ డైరెక్టర్గా నియమిస్తూ కేంద్ర నియామకాల క్యాబినెట్ కమిటీ (ఏసీసీ) బుధవారం ఆదేశాలు జారీచేసింది. 1993 బ్యాచ్ ఇండియన్ రెవె న్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి అయిన రాహుల్ నవీన్ ఈ పదవిలో రెండేండ్లపాటు కొనసాగుతారు. ఈడీ లో ఆయన 2019 నవంబర్లో స్పెషనల్ డైరెక్టర్గా చేరారు.




