24-06-2025 08:18:39 AM
చర్ల,( విజయ క్రాంతి): స్థానిక చర్ల లో గల రాహుల్ విజ్ఞాన విద్యాలయంలో సిల్వర్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించారు,తాను చదువుల్లో గొప్ప చదువులు చదివి ఉన్నత ఉద్యోగంలో ఉండి దేవుడు తర్వాత దేవుడిగా ప్రశంసపొందే డాక్టర్ వృత్తిలో ఉన్న డాక్టర్ డి ఎన్ కుమార్ చదువుకున్న చదువు మరికొందరిని చదివించాలి అనే ఆశయంతో పుట్టిన ఊరులోనే కుమారుడు రాహుల్ జ్ఞాపకార్థం రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం ఏర్పాటు చేసి విద్యార్థులకు చక్కని భవితవ్యాన్ని అందించే ఆలోచనతో జన్మభూమి మీద మక్కువతో ఎంతోకొంత ఋణం తీర్చుకుందామనే మంచి మనస్సుతో, గ్రామీణ వాసులకు ఉన్నతమైన - నాణ్యమైన విద్యను అందించాలనే అభిలాషతో సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం 2000 వ సంవత్సరంలో జూన్ 22 న తుమ్మల నాగేశ్వరరావు చేతుల ప్రారంభించబడిన రాహుల్ విజ్ఞాన విద్యాలయం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
డాక్టర్ డి. ఎన్ కుమార్ (దేవభక్తుని నిర్మాలానంద కుమార్)చే అంకురించబడిన రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం ఇరవై ఐదు సంవత్సరంలు నింపుకొని ఇరవై ఆరవ సంవత్సరంలో అడుగుపెడుతున్న రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం అధినేత డాక్టర్ డి ఎన్ కుమార్ విద్యాలయం లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు హృదయపూర్వక అభినందనలు తెలియ చేసారు డాక్టర్ డి ఎన్ కుమార్ డాక్టర్ ప్రతిభ లు, ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు, అనంతరం ఈడి శాస్త్రి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేట్ స్థాయి విద్యాలయం ఏదైనా ఉంది అంటే అది రాహుల్ విజ్ఞాన విద్యాలయమే గత ఏడాది విద్యార్థులు పదవ తరగతిలో సాధించిన మార్కుల కంటే ఈ ఏడాది పదవ తరగతి బ్యాచ్ ఎక్కువ మార్కులు సాధించాలని 25 సంవత్సరాలుగా సహకరించిన తల్లిదండ్రులకు విద్యార్థులకు గ్రామస్తులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
భారతి,పాఠశాల ప్రిన్సిపల్ రాజు వర్మ, ఎంవిఎల్ నరసింహారావులు మాట్లాడుతూ... ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థుల జీవితాల్లో ఆశాకిరణమై, ఎన్నో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించడానికి ఊతమై, బంగారు భవిష్యత్తు సాధించడానికి మార్గదర్శి గా మారుమూల ప్రాంత వాసులను ముందుండి నడిపిస్తున్న రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం చర్లలో వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ఏదైనా ఉంది అంటే అది రాహుల్ విజ్ఞానికే దక్కుతుంది అంటూ ప్రిన్సిపల్ రాజు వర్మ మరియు ఎం వి ఎల్ నరసింహారావు లు తెలియజేశారు, ఈ పాఠశాలలోనే చదువుకొని డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నత ఉద్యోగాల్లో మరియు ఇతర దేశాలలో స్థిరపడ్డవారు లేకపోలేదని అన్నారు, ఈ కార్యక్రమానికి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థులు సైతం హాజరయ్యారు ,ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు రాము,శ్రీధర్, సునీత, రమా దేవి , ఉస్మాన్, సునీత, చైతన్య శ్రీ, లావణ్య , సంద్యా ,స్వాతి ,ప్రదీప్, ఆనంద్ అనూష ,జ్యోతి మాధురి, మౌనిక శ్రావణి,మరియు తదితర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.