19-10-2025 01:00:50 AM
పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాం తి): రాష్ట్రంలో ఆదివారం నుంచి ఐదు రోజు ల పాటు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ సూచించింది. ఈమేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురు స్తాయని పేర్కొంది. గంటకు 30 వేగం తో గాలులు సైతం వీస్తాయని తెలిపింది. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. సోమవారం నుంచి గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.