10-01-2026 12:50:55 PM
బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ఊర చెరువు సమీపంలో బేగంపేట ప్రధాన రోడ్డు ప్రక్కన చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి రాజస్థాన్ వాసి మృతిచెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.బేగంపేట గ్రామస్తుల వివరాల ప్రకారం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కాందిలి జెటా మంగళ్ పటేల్,కాందిలి జెటా రామ్ పటేల్ ఇద్దరు స్వంత అన్నదమ్ములు.గతంలో ఇద్దరు అన్నదమ్ములు మండల కేంద్రంలో హోటల్ నిర్వహించి జీవనం సాగించారు.మంగళ్ పటేల్ మండలంలోని బేగంపేటలో స్థిరపడగా మృతుడు జెట్ రాం పటేల్(40) రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో తన చెల్లి సంబంధించిన హోటల్ లో పని చేస్తున్నాడు.
శుక్రవారం రాత్రి సమయంలో జెట్ రాం మదుమేహ వ్యాధికి మందులు కొనుగోలు చేసుకుని మండల కేంద్రంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు.మృతునికి భార్య,కుమారుడున్నారని...వారు రాజస్థాన్ యందు జీవనం సాగిస్తున్నట్టు సమాచారం.ఎస్ఐ సౌజన్య సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.వివరాలు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.