4 July, 2026 | 10:34 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన నేత

16-09-2024 05:28 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఆయన విగ్రహం తెలంగాణ సచివాలయం ముందు ఎలా పెడతారని కొందరు ప్రతిపక్ష నేతలు అడుగుతున్నారని కోమటి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎప్ పార్టీకి లేదని, ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానేత అన్నారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన నేత అని,  10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పాలనలో తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేయాలని కేసీఆర్ కు గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నించారు. డిసెంబర్ 9న ఇక్కడే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని కోమట్టి రెడ్డి చెప్పారు.