దన్నూర్ ప్రాథమిక పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు
27-08-2026 02:40 PM
బోథ్,ఆగస్ట్ 27 (విజయక్రాంతి): మండలంలోని దన్నూర్ ప్రాథమిక పాఠశాలలో గురువారం రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. విద్యార్థినిలు తోటి విద్యార్థులకు రాఖీ కట్టి సహోదర భావాన్ని వ్యక్తపరిచారు. మరోవైపు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రావుల శంకర్ రక్షాబంధన్ ప్రాముఖ్యతను విద్యార్థుల వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.






