26-06-2025 10:03:21 PM
సనత్ నగర్ (విజయక్రాంతి): బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి రావాలంటూ మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Former Minister Talasani Srinivas Yadav)కు ఆహ్వానాన్ని అందజేశారు. ఈ మేరకు గురువారం వెస్ట్ మారేడ్ పల్లిలోని కార్యాలయంలో ఆలయ అధికారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమ్మవారి కళ్యాణానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ ట్రస్టీ చైర్మన్ సాయిబాబా గౌడ్, EO మహేందర్ గౌడ్, సూపరింటెండెంట్ హైమావతి, అమీర్ పేట డివిజన్ BRS అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, కూతురు నర్సింహ, బలరాం, వనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.