21-06-2025 12:25:53 AM
పాల్గొన్న లయన్స్ క్లబ్, వికాస్ తరంగణి జీర్మటం సభ్యులు
భద్రాచలం, జూన్ 20 (విజయ క్రాంతి)జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం జీయర్ మఠం, వికాస్ తరంగణి, శివానంద ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో సభ్యులు శుక్రవారం భద్రాచల పట్టణంలో యోగ ర్యాలీ నిర్వహించారు. మానవాళి మనుగడకు యోగాయే ప్రధాన సాధనమని, ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులు గా తయారవుచ్చని పేర్కొంటూ ర్యాలీలో నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షురాలు కమల రాజశేఖర్, కార్యదర్శి సిద్ధారెడ్డి, కోశాధికారి రామారావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రామలింగేశ్వరరావు, పరిమి సోమశేఖర్, హరిచంద్ర నాయక్, వెంకటాచారి, చల్లగుండ్ల నాగేశ్వరరావు, మిస్టర్ కృష్ణ, సీతామహాలక్ష్మి, నరసింహాచారి, తదితరులు పాల్గొన్నారు.