calender_icon.png 21 June, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ ర్యాలీ ప్రదర్శన నడుమ ‘నూతి’ అభినందన సభ

21-06-2025 12:27:43 AM

  1. మల్లు బట్టి పాదయాత్ర విజయవంతంలో ’నూతి ’ కీలక పాత్ర..

కష్టపడి పని పనిచేసిన కార్యకర్తను కాంగ్రెస్ మరువదు...

వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్..

వైరా, జూన్ 20(విజయ క్రాంతి): పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరువదని.. వారికి కచ్చితంగా పదవులు ఇచ్చి గౌరవిస్తుందని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పేర్కొన్నారు.. వైరాలోని ఎన్ వి ఎస్ గార్డెన్ లో ఇటీవల టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నూతి సత్యనారాయణకు గౌడ సంఘం కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభినందన సభ నిర్వహించారు..

తొలుత అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాయకులు కార్యకర్తలు గౌడ సంఘం ప్రతినిధులు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, రాష్ట్ర హస్తకళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ,నూతి సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తదితరులు హాజరై ర్యాలీ ప్రదర్శనలో వాహనంపై ఉండి ప్రజలకు అభివాదం చేశారు..

అనంతరం ఎన్ వి ఎస్ గార్డెన్ లో నూతి సత్యనారాయణ దంపతులను  ఘనంగా శాలువాలతో సన్మానించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోపాటు నాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆశీస్సులతో ఆయన సంపూర్ణ సహకారంతో పీసీసీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణకు దక్కిందని.. మల్లుబట్టి పాదయాత్ర చేస్తున్న సమయంలో నూతి సత్యనారాయణ అత్యంత కీలకమైన పాత్ర పోషించారని పాదయాత్ర విజయవంతానికి కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనన్నారు.ఈ కార్యక్రమంలో , మున్సిపల్ కార్పొరేషన్ డెవల్మెంట్ చైర్మన్ నరసింహ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు, మొహమ్మద్ జావేద్, మాజీ మార్క్ ఫైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, దొడ్డ పుల్లయ్య, పిసిసి మెంబర్, కొనిజర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు వడ్డే నారాయణరావు,

బోళ్ళ గంగారావు, పమ్మి అశోక్, మచ్చ బుజ్జి, మట్టూరి వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ నంబూరు కనదుర్గ, ఏన్కూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు, స్వర్ణ నరేందర్, దార్నా రాజశేఖర్, కోసూరి శ్రీను, దర్జీ చెన్నారావు, మరికంటి డేడి కుమారి, జిల్లా కిసాన్ అధ్యక్షులు మొక్క శేఖర్ గౌడ్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.