75 మీటర్ల త్రివర్ణ పతాకంతో ర్యాలీ
మేడ్చల్ (విజయక్రాంతి): గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమంలో భాగంగా 75 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి(Assembly Convener Amaram Mohan Reddy) మాట్లాడుతూ, దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉన్నప్పుడే దేశాభివృద్ధి చెందుతుందన్నారు. పహల్గం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తో ప్రత్యర్థిస్తావరాలను మట్టుపెట్టిన తర్వాత దేశ ప్రజల ఐక్యత అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు కావేరి శ్రీధర్ ముదిరాజ్, జిల్లా కిషన్ మోర్చా నాయకులు కృష్ణ గౌడ్, మాజీ కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్, అమరం సరస్వతి, ప్రధాన కార్యదర్శులు కృష్ణ, రామారావు, నాయకులు కిషన్, శ్రీకాంత్, వెంకటేష్, సత్యనారాయణ, చంచాల సురేష్, విక్రమ్, నాగరాజు, నరేష్, నవీన్, ప్రవీణ్, అభిలాష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు బట్టి కాడి నవనీత, యువర్ మోర్చా నాయకులు శాంతన్ రెడ్డి, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.






