పద్మశ్రీ దీపికా రెడ్డికి అభినందనలు తెలిపిన రాంచందర్రావు
24-03-2026 12:59 AM
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాం తి): పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపికా రెడ్డిని భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శా ఖ ఆధ్వర్యంలోని నాగపూర్లో ఉన్న సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యురాలిగా నియమించినందుకుగానూ ఆమెకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అభినందనలు తెలిపారు. ఈ నియామకం తెలంగాణకు మాత్రమే కాకుండా మన ప్రాచీన హిందూ నాగరిక వారసత్వాన్ని విలువైనదిగా భావించే ప్రతి ఒక్కరికీ గర్వకారణమన్నారు.




