13 May, 2026 | 11:03 AM

పుదుచ్చేరి సీఎంగా ఎన్. రంగస్వామి.. 5వ సారి ప్రమాణ స్వీకారం

13-05-2026 10:27 AM

పాండిచ్చేరి: సీనియర్ రాజకీయ నాయకుడు, ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్(All India N. R. Congress) వ్యవస్థాపకుడు ఎన్. రంగస్వామి బుధవారంనాడు ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. AINRC నేతృత్వంలోని NDA ప్రభుత్వంలో, మరో ఇద్దరు మంత్రివర్గ సభ్యులు ప్రాంతీయ పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు, BJPకి చెందిన A. నమశ్శివాయం కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాష్‌నాథన్(Lieutenant Governor K. Kailashnathan), ముఖ్యమంత్రికి, ఆయన మంత్రివర్గ సహచరులకు పదవీ ప్రమాణం చేయించారు. రంగస్వామి దైవసాక్షిగా ప్రమాణం చేశారు.  మల్లాడి కృష్ణారావు తెలుగులో ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పుదుచ్చేరి ప్రాంతమైన యానంకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 18 స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ హాజరయ్యారు.