21-06-2025 01:39:09 AM
రాజేంద్రనగర్ జూన్ 20 : మున్సిపాలిటీల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటు న్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల వేగంగా అభివృద్ధి చెం దుతున్న మున్సిపాలిటీల అభివృద్ధిని పరిశీలించేందుకు సీఎం ఆదేశాల మేరకు ప్రజల కు మెరుగైన సేవలు అందించేందుకు పర్యటిస్తున్నట్లు తెలిపారు.
శుక్రవారం ఆయన శంషాబాద్ మున్సిపాలిటిని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, సంబంధిత శాఖల సెక్రటరీలతో కలిసి సందర్శించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని గ్రామాలు ఓఆర్ఆర్ అవతలి వైపు, ఓఆర్ఆర్ పక్కన గల గ్రామాలు, జిహెచ్ఎంసిలో విలీనమైనందున ఆయా గ్రామాల మౌలిక సదుపాయాలు ఏమేరకు అభివృద్ధి చెందుతున్నాయో తెలుసుకోవటానికి శంషాబాద్ ను సందర్శించినట్లు తెలిపారు.
తాగునీటి కొరత ఉండొద్దు
తాగునీటి సౌకర్యంపై కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన కాలనీలలో పైప్ లైన్లను వేయాలని, అందు కు సంబంధించిన ఎస్టిమేట్లను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులు ఆదేశిం చారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా కావలసిన నిధులను గ్రామపంచాయతీలకు, మునిసిపాలిటీలకు విడుదల చే స్తున్నట్లు వివరించారు.
అనంతరం సిఎస్ మాట్లాడుతూ.. పన్ను వసూళ్లలో ఈ సంవత్సరము 23 శాతం తక్కువ వసూలు చేయ డంపై లక్ష్యాలను అధిగమించాలని, కొత్త ఇండ్ల అసెస్మెంట్ లను చేయించి మున్సిపాలిటీల ఆదాయం పెంచాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, వాటి పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మున్సిపల్ పరిధిలో విద్యుత్ దీపాలు, వార్డుల్లో నాలాల శుభ్రత తదితర అంశాల్లో తగిన ప్రాధాన్యత ఇచ్చి ప్ర జలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పని చేయాలని అధికారులకు ముఖ్య కార్యదర్శి సూచించారు. అనంతరం కొత్వాల్ గూ డలో నిర్మాణంలో ఉన్న హెచ్ఎండిఏ ఎకో పార్కును సందర్శించి అక్కడి పక్షుల పార్కులోని వివిధ దేశాల పక్షులు, గార్డెనింగ్ ప్ర త్యేక ఆకర్షణగా ఉన్నాయని నిర్వాహకులకు తెలియజేశారు.
ఆ తరువాత రాజేంద్రనగర్ బుద్వేల్ లోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. కార్యక్రమం లో రాష్ట్ర మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇలంబర్తి, హెచ్ఎండిఎ సెక్రటరీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆర్డిఓ వెంకట్ రెడ్డి, హౌ సింగ్ పీడీ నాయక్, శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, సంబంధిత అధికారులు తదితరులుపాల్గొన్నారు.