21-06-2025 01:37:06 AM
కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే యాదయ్య
మొయినాబాద్, జూన్ 20:మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎంకేపల్లి లో సర్వే నెంబర్ లో 180 లో రైతులకు ఎకరాకు 1000 గజాలు ఇవ్వాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం టీపీసీసీ మెంబర్ షాబాద్ దర్శన్ తో కలిసి కలెక్టర్ నారాయణ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 180 సర్వే నెంబర్ లో సాగులో ఉన్న 70 కుటుంబాలకు ఎకరాకు 1000 గజాల చొప్పున భూమి ఇవ్వడంతో పాటు అక్కడ ఏర్పాటు చేస్తున్న గోశాలలో ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.
స్స్పందించిన కలెక్టర్ పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్, మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్ ముదిరాజ్ , సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేశ్, శ్రీరామ్ నగర్ మాజీ ఎంపీటీసీ పట్నం రామ్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.