calender_icon.png 21 June, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సమస్యలను త్వరగా పరిష్కరించాలి

21-06-2025 01:40:33 AM

సీపీఎం పార్టీ నాయకులు

ఇబ్రహీంపట్నం, జూన్ 20:రైతు సమస్యలను త్వరగా పరిష్కరించాలని  సిపిఎం పార్టీ నాయకులు కోరారు. శుక్రవారం మంచాల మండల పరిధి బండలేముర్ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాహసిల్దార్ ఎం.వి ప్రసాద్ రావు కు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ పోచమోని కృష్ణ మాట్లాడుతూ..

బండాలేమూర్ లో భూసమస్యలతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ రెవెన్యూ సదస్సులో వాటి పరిష్కారం కోసం దరఖాస్తులు చేసుకు న్నారని, వాటిని త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లె వీరయ్య, మాజీ ఎంపీటీసీ వట్టి వెంకటేష్, మల్లం జంగయ్య, బద్దుల మల్లేష్, జర్పుల కిషన్ తదితరులుపాల్గొన్నారు.