21-06-2025 01:40:33 AM
సీపీఎం పార్టీ నాయకులు
ఇబ్రహీంపట్నం, జూన్ 20:రైతు సమస్యలను త్వరగా పరిష్కరించాలని సిపిఎం పార్టీ నాయకులు కోరారు. శుక్రవారం మంచాల మండల పరిధి బండలేముర్ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాహసిల్దార్ ఎం.వి ప్రసాద్ రావు కు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ పోచమోని కృష్ణ మాట్లాడుతూ..
బండాలేమూర్ లో భూసమస్యలతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ రెవెన్యూ సదస్సులో వాటి పరిష్కారం కోసం దరఖాస్తులు చేసుకు న్నారని, వాటిని త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లె వీరయ్య, మాజీ ఎంపీటీసీ వట్టి వెంకటేష్, మల్లం జంగయ్య, బద్దుల మల్లేష్, జర్పుల కిషన్ తదితరులుపాల్గొన్నారు.