20 March, 2026 | 5:44 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

జిల్లా ప్రధాన కార్యదర్శిగా రవికుమార్ గాజుల కుమార్

20-03-2026 02:31 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా గాజుల రవికుమార్ నియమితులయ్యారు. గురువారం జిల్లా కమిటీని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ నాయకుడిగా, టిఆర్ఎస్వి ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా, పని చేసిన ఆయన కాంగ్రెస్ నియోజకవర్గ శ్రీ హరిరావుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ యువ నాయకుడిగా, పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించి జిల్లా స్థాయిలో ఈ పదవి కట్టబెట్టారు. జిల్లా కమిటీలో స్థానం కల్పించిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు, నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహర్ రావుకు, జిల్లా అధ్యక్షులు వెడుమ బుంజు పటేల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు