4 July, 2026 | 11:12 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

మెరిసిన ఆర్సీబీ

08-04-2025 01:35 AM
  1. ముంబైపై విజయం సాధించిన ఆర్సీబీ
  2. విరాట్ కోహ్లీ, పాటిదార్ అర్ధ సెంచరీలు
  3. ఉత్కంఠగా మ్యాచ్

ముంబై, ఏప్రిల్ 7: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో మ్యాచ్ గెలిచింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 12 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయఢంకా మోగించింది. చివరివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరికి విజయం బెంగళూరునే వరించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (67), కెప్టెన్ పటీదార్ (64) అర్ధ సెంచరీలు చేశారు. 222 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన ముంబై  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయడంతో హోం గ్రౌండ్‌లో ఓటమిని అంగీకరించక తప్పలేదు.

హర్ధిక్ పాండ్యా (42) (15 బంతుల్లో) ఆశలు రేపినా విజయం మాత్రం ముంబై దరి చేరలేదు. నేడు డబుల్  హెడర్‌లో భాగంగా.. మధ్యాహ్నం కేకేఆర్, ఎల్‌ఎస్‌జీ.. రాత్రి పంజాబ్, చెన్నై జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.