27 June, 2026 | 2:21 PM

Breaking News

అతిథి ఉపాధ్యాయుల కోసం దరఖాస్తులు చేసుకోండి   •   రెండు చుక్కలే..చిన్నారుల భవిష్యత్‌ కు రక్షణ!   •   మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు   •   ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్   •   ప్రమాదానికి మద్యం మత్తే కారణం   •   షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ   •   సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.   •   ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం   •   జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం   •   ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు   •  

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఆర్సిఓ..

12-11-2025 05:21 PM

నిర్మల్ (విజయక్రాంతి): స్థానిక నిర్మల్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల(బాలుర) నందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆర్సిఓ శ్రీధర్ బుధవారం తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించబడెను. ఈ సందర్బంగా ఆర్సిఓ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ జ్ఞానం అనేది విద్యార్థుల తెలివికి పదును పెట్టి, వారిని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుందని.. ఇట్టి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ & DCO శ్రీ  కోడె జీవన్ కుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ బట్టు విజయ్ కుమార్, ఖానాపూర్ ప్రిన్సిపాల్ సంతోష్ తో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.