7 August, 2026 | 9:36 PM

నర్సాపూర్ శివారులో రీ-సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన ఆర్డీఓ

07-08-2026 08:39 PM

బోధన్,(విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా బోధన్ మండలంలోని నర్సాపూర్ శివారులో శుక్రవారం రీ-సర్వే నిర్వహించారు. సర్వే నంబర్ 881, విస్తీర్ణం ఎకరాలు 4.00 గుంటలు ఉన్న భూమిలో నిర్వహించిన రీ-సర్వే ప్రక్రియను బోధన్ ఆర్డీఓ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 

ఈ కార్యక్రమంలో బోధన్ డీఐఓఎస్ శ్రీ ఏ. దత్తు, బోధన్ తహశీల్దార్ శ్రీ పీ. విఠల్, లైసెన్స్డ్ సర్వేయర్ శివరాజ్, సంబంధిత సర్వే నంబర్ భూ అనుభవదారులు, వారి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.