09-06-2025 12:44:07 AM
నెలాఖరు వరకు బియ్యం పంపిణీ
మహబూబాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తుండడంతో వినియోగదా రులు బియ్యం తీసుకెళ్లడానికి సరిపడా పెద్ద సంచులు వెంట తెచ్చుకోవాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రేషన్ షాపులో ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు ఆయా గ్రామాల్లో వాట్సాప్ గ్రూపులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
జూన్ నెలాఖరు వరకు అనగా 30వ తేదీ వరకు మూడు నెలలకు సంబంధించి (జూన్, జులై, ఆగస్టు) రేషన్ బియ్యం సరఫరా చేయుటకు ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొంటున్నారు. కొందరు కేవలం 15వ తేదీ వరకే బియ్యం ఇస్తారని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఈనెల 30 వరకు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని సివిల్ సప్లై అధికారులు పేర్కొంటున్నారు.