calender_icon.png 22 June, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెడ్ క్రాస్ సేవలు గ్రామాలలో విస్తరించాలి..

21-06-2025 08:26:04 PM

జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు...

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు గ్రామీణ ప్రాంతాలలో విస్తరించాలని జిల్లా కలెక్టర్ జిల్లా అధ్యక్షులు ఎం హనుమంతరావు(District Collector Hanumantha Rao) అన్నారు. శనివారం భువనగిరిలో రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలోనీ యువతను రక్తదానం చేయించడంలో ప్రోత్సహించాలని, విరివిగా రక్తదానాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

యోగ ప్రతి వ్యక్తికి ఎంతో అవసరం..

నేడున్న పరిస్థితుల్లో యోగా ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమని డిసిపి అక్షాంశ్ యాదవ్ అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ భువనగిరి శాఖ రెడ్ క్రాస్ సంయుక్తంగా ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన యోగా కార్యక్రమాన్ని డిసిపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు, మానసిక ప్రశాంతతో జీవించవచ్చునని పేర్కొన్నారు. భారతదేశంలో పుట్టిన యోగ నేడు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థులకు యువతకు యోగాపై అవగాహన  కల్పించాలని కోరారు.జిల్లాలో రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రజలకు ఎంతో తోడ్పడుతున్నాయని చెప్పారు.

రక్తదానాల పట్ల నేటి యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్ట్ ఆఫ్ లీవింగ్ భువనగిరి శాఖ, రెడ్ క్రాస్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ.. నేటి యువత రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు ప్రమాద సమయాల్లో, అత్యవసర సమయాల్లో రక్తం ఎంతో అవసరం పడుతుందని, దానం చేయడంతో మాత్రమే రక్తాన్ని సేకరించవచ్చునని అన్నారు.రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.

 రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ బి లక్ష్మి నరసింహ రెడ్డి మాట్లాడుతూ... భువనగిరి జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు స్థలాన్ని కేటాయిస్తే భవనం నిర్మించేందుకు దాతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇక్కడ భవనాన్ని నిర్మించడం వల్ల బ్లడ్ బ్యాంకు ను ఏర్పాటు చేసి, అటు మెడికల్ కాలేజీ, ఇటు ఎయిమ్స్ తో పాటు జిల్లా ప్రజలకు రక్తాన్ని అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీల నాయకులు ప్రముఖులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.జిల్లా కార్యాలయానికి స్వచ్ఛందంగా తమ భవనాన్ని కేటాయించిన వివేరా హోటల్ సాధినేత సద్ది వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా సమావేశం కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సందర్భంగా అధిక రక్తదానం చేసిన దాతలను, అధిక సభ్యత్వం నమోదు చేసిన రెడ్ క్రాస్ ప్రతినిధులను, సేవా కార్యక్రమంలో  తోడ్పాటు అందిస్తున్న ప్రతినిధులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల మహేందర్రెడ్డి, కోశాధికారి డి అంజయ్య, డివిజన్ చైర్మన్ సద్ది వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎల్లంకి పురుషోత్తం రెడ్డి జిల్లా డైరెక్టర్లు డాక్టర్.శేక్.హమీద్ పాశ,కే ప్రభాకర్ రెడ్డి,ఎస్ ఎన్ చారి, ఎండి ఖలీల్, జిల్లా కార్యదర్శి ఎస్పి ఉపేందర్ రావు,డివిజన్ కమిటీ సభ్యులు, ఐలేని రామిరెడ్డి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు చింతా బాలయ్య, ఉప్పుల రవి, దుర్గం లక్ష్మణ్, మల్లేశం, భాస్కరరావు, గడ్డం శ్రీనివాస్,రెడ్ క్రాస్ జిల్లా పట్టణ ప్రతినిధులు, కందుల శ్రీనివాస్, కుకుటపు చంద్రశేఖర్, స్పందన, లావణ్య, వెంకాయమ్మ సిస్టర్, బండారు జయశ్రీ, కందుల శ్రీనివాస్, చింత పండు రాజు, తాళ్లపల్లి చంద్రశేఖర్, మహమ్మద్ జానీ, రత్నాపురం పద్మ, తదితరులు పాల్గొన్నారు.