21-06-2025 08:29:15 PM
మునగాల: ప్రతి ఒక్కరూ యోగ చేయడం వలన వారి ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉంటారని సిఐ రామకృష్ణారెడ్డి(CI Ramakrishna Reddy) అన్నారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) పురస్కరించుకొని మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మానసిక, శారీరక, ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు యోగా చేయాలని సూచించారు.
యువతీ యువకులు వ్యసనాలకు బానిస కాకుండా మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం వేళలా కొంత సమయాన్ని కేటాయిస్తూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని, యోగ చేయడం వలన పలు రకాల వ్యాధులు దరిచేరకుండానే ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు. అనంతరం యోగ ఆసనాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్. నడిగూడెం ఎస్ ఐ అజయ్. మోతే ఎస్ఐ యధవేందర్ రెడ్డి. సర్కిల్ పోలీస్టాప్స్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.