15-10-2025 03:07:59 PM
షాపుల ఏర్పాటుకు అధికారులతో మచ్చిక
అమ్మకాలపై నిబంధనలు బేఖాతర్
పటాకులు అమ్మకాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి
ఉమ్మడి జిల్లాలో ఇష్టారీతిన అధిక రేట్లకు వ్యాపారుల అమ్మకాలు
దీపావళి కోసం కోనసాగుతున్న ఏర్పాట్లు
బాన్సువాడ,(విజయక్రాంతి): దీపావళి పర్వదినాన పటాకుల దుకాణాల కోసం వ్యాపారులు అప్పుడే పావులు కదుపుతున్నారు. తమ షాపులను నెలకొల్పుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. పెద్ద ఎత్తున షాపులను ఏర్పాటు చేసుకొని టపాసులను అమ్ముకునే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అందుకు కావలసిన అనుమతుల కోసం పోటీ పడుతున్నారు. సంబంధిత శాఖల అధికారులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు పోలీస్ శాఖ, అటు అగ్నిమాపక శాఖ అధికారులను కలిసి టపాసులు బాణ సంచాలను అమ్ముకునేందుకు అధికారుల ఆశీర్వాదం కోసం వెంపర్లాడుతున్నారు.
మందు గుండు సామాగ్రిని విక్రయించాలంటే వ్యాపారులు తూచా తప్పకుండా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఏమాత్రం ప్రమాదం జరిగిన ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. ప్రతి ఏటా టపాసుల దుకాణాలు ఏర్పాటు కావడం, పెద్ద మొత్తంలో అమ్మకాలు జరిగిపోవడం, వ్యాపారులు అధికంగా లాభార్జించడం ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. అందుకు సంబంధిత అధికారులు కూడా వ్యాపారులకు అనుగుణంగా వ్యవహరించడంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తూ వస్తున్నాయి.
జనావాస ప్రాంతాల మధ్య, రద్దీగా ఉండే చౌరస్తాల వద్ద టపాసుల దుకాణాలు పెట్టడానికి ఎలాంటి అవకాశం లేదు. అలాగే కిరాణా షాపులు జనరల్ స్టోర్ లలో కూడా టపాసులు అమ్ముకునేందుకు ఎంత మాత్రం నిబంధనలు ఒప్పుకోవు. జనం కిటకిటలాడే ప్రధాన కూడళ్లలో రోడ్లపై పెట్టి పటాకులు అమ్ముకుని పరిస్థితి ఎంత మాత్రం ఉండదు. టపాసులు అమ్ముకోవాలంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా అవసరం. కానీ ప్రతి ఏటా దీపావళి రావడం, పటాకులు అమ్ముకోవడం, నిబంధనలను అతిక్రమించడం పరిపాటిగా మారిపోతుంది. పట్టణ శివారు ప్రాంతాల్లో మాత్రమే టపాసుల దుకాణాలు పెట్టుకునేందుకు అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
ఏమాత్రం ఘటన జరిగిన ప్రాణాపాయం జరగకుండా ఉండే అవకాశం కలుగుతుంది. కానీ వ్యాపారులు పట్టణ నడిబొడ్డులో జనావాస ప్రాంతాల మధ్య దుకాణాలను నెలకొల్పుకుంటున్నారు. దీనివల్ల ఆ ప్రాంత ప్రజలు ఇప్పుడేం జరుగుతుందోనని బీతిలి పోవాల్సి వస్తుంది. దీపావళి పండుగ సంబరాలను సంతోషంగా జరుపుకునేందుకు వీలుగా నిబంధనల మెరికి పటాకుల దుకాణాలను నెలకొల్పునందుకు అవకాశం కల్పించేందుకు ఈ ఏడైనా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా నిబంధనలను అతిక్రమించకుండా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రూల్స్ పాటించకపోతే కొరడా.. నిజామాబాద్ సిపి హెచ్చరిక
టపాకాయల దుకాణాదారులు డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతిని తప్పకుండా తీసుకోవాలని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈసారి దీపావళి పండుగలో టపాసులు అమ్మకం దారులు నిబంధనలు పాటించకపోతే సి పి సాయి చైతన్య హెచ్చరించారు. దీపావళి పండుగ సందర్బంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు వారి వారి సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి కార్యాలయం నుండి ధరఖాస్తు చేసుకొని అనుమతి పత్రం పొందాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజినల్ స్థాయి అధికారిని సంప్రదించాలని సూచించారు.ఎవ్వరయిన సంబంధిత డివిజినల్ పోలీస్ అధికారి నుండి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పినట్లయితే వారిపై ఎక్స్ ప్లోజివ్ యాక్టు - 1884 మరియు రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమిషనర్ హెచ్చరించారు.
పటాకుల షాపుల కోసం నిబంధనలేవే...
టపాకాయల దుకాణాదారులు తప్పక ఈ క్రింది నిబంధనలు పాటించాలి.టపాకాయల దుకాణాలు సంబందిత ఖాళీ ప్రదేశాలలో నెలకొలుపు కోవాలి. ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్.ఓ.సి సర్టిఫికేటు పొందపర్చాలి.ఒక క్లస్టర్లో 50 షాపులకు మించ కుండా ఉండాలి.జనరద్దీగల ప్రదేశాలలో ఎలాంటి టపాకాయల షాపుల ఏర్పాటు చేయరాదు. అదేవిధంగా కళ్యాణ మండపాలలో , సమావేశాల కేంద్రాలలో టపాకాయల దుకాణాలు నెలకొల్పరాదు..తాత్కాలిక టపాకాయల దుకాణాలలో ఫైర్ కు సంబంధించిన జాగ్రత్తలు తప్పక పాటించేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తివివరాలతో కూడిన దరఖాస్తు డీఎస్పీ లేదా సంబంధిత ఎ.సి.పి కార్యాలయాల్లో సమర్పించాలని సిపి ,పి ,సాయి చైతన్య సూచించారు.