13 May, 2026 | 4:42 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

ఢిల్లీ పీఠంపై రేఖా గుప్తా

20-02-2025 12:49 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: బీజేపీ అధిష్టానం బుధవారం రేఖా గుప్తాను సీఎంగా ప్రకటించింది. ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మకు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. బుధవారం సా యంత్రం సమావేశమైన శాసనసభా పక్షం ఈ మేరకు నిర్ణయం వెలువరించిం ది. 50 ఏండ్ల రేఖ షాలిమర్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.  

ఎవరీ రేఖా గుప్తా? 

సీఎం రేసులో కొద్ది రోజుల నుంచి రేఖా గుప్తా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన రేఖ అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పటికే మూడు సార్లు కౌన్సిలర్‌గా అలాగే ఓసారి సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కూడా పని చేశారు.

మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినా కానీ బీజేపీ మాత్రం ఆమెను ఢిల్లీ పీఠం మీద కూర్చోబెట్టింది. ఢిల్లీకి నాలుగో మహిళా సీఎంగా రేఖా గుప్తా నిలవనున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈ రోజు మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.