18 July, 2026 | 1:14 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

విచారణకు సమయం లేదు

19-02-2025 11:24 PM

సీఈసీ, ఈసీల నియామకంపై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు..

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. సమయాభావం వల్ల విచారణను వాయిదా వేస్తున్నట్టు బుధవారం పేర్కొంది. అయితే పిటిషన్లపై మార్చి 19న విచారణ జరుపుతామని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం హామీ ఇచ్చింది.

సీఈసీ, ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్షనేత, భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఉండాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చి సీజేఐ స్థానంలో కేంద్ర మంత్రికి స్థానం కల్పించింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై విచారణ సుప్రీం కోర్టు పరిధిలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం సోమవారం రోజు కొత్త సీఈసీని, ఎన్నికల కమిషనర్‌ను నియమించింది. ఈ నియామకాన్ని కూడా పిటిషనర్లు తాజాగా వ్యతిరేకించారు.