మధ్యప్రదేశ్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు హతం
20-02-2025 12:50 AM
భోపాల్, ఫిబ్రవరి 19: బాలాఘాట్ జిల్లాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ బుధవా రం ప్రకటించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న పోలీసులను ఆయన అభినందించారు. 2026 నాటికి దేశం లో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చే స్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఈ క్రమంలోనే నక్సల్స్ ఏరివేతపై తమ ప్రభుత్వం సీరియస్గా పని చేస్తున్నట్టు చెప్పారు. సీఆర్పీఎఫ్, కోబ్రా, డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ సహా 12 బృందాలు సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నట్టు పేర్కొన్నారు.






