05-05-2025 10:46:20 PM
ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ లబ్ధిదారుల చెక్కుల పంపిణీలో దయాకర్ రెడ్డి, మద్దినేని స్వర్ణ కుమారి..
పాలేరు (విజయక్రాంతి): సీఎం రిలీఫ్ ఫండ్ తో నిరుపేదలకు ఎంతో ఊరట కలుగుతోందని, అనారోగ్యంతో సతమతమవుతూ వైద్యం చేయించుకోవటానికి ఇబ్బంది పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఆర్థిక చేయూత కలుగుతోందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy), ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని స్వర్ణ కుమారి పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ లబ్ధిదారుల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో జరిగింది.
113 మంది లబ్దిదారులకు సుమారు రూ. 40 లక్షల విలువ చేసే చెక్కులను అందించారు. ఈ సందర్భంగా చెక్కుల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడుతూ... మంత్రి పొంగులేటి సిఫారసుతో నియోజకవర్గానికి చెందిన అనేక మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు అనతి కాలంలోనే చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆయన నేతృత్వంలో పాలేరు నియోజకవర్గం కొత్త పుంతలు తొక్కుందని అభివర్ణించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చేందుకు మంత్రి పొంగులేటి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపుగా అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటుతో పాటు విద్యుత్ సమస్య లేకుండా చూడటం, చెక్ డ్యాంలను ఏర్పాటు చేయించడం మొదలగు అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు.