సొంత నిధులతో రోడ్ల మరమ్మతు
28-05-2024 12:53 AM
రాజేంద్రనగర్, మే 27 (విజయ క్రాంతి) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓంనగర్ కాలనీలో పాడైన రోడ్లను కాలనీవాసులంతా కలిసి సొంత నిధులతో కాలనీ అధ్యక్షుడు మన్నె నవీన్కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సోమవారం మట్టిని పోయించి మరమ్మతులు చేసుకున్నారు. స్థానికంగా వర్షం పడితే కాలనీలోని రోడ్లు గుంతలమయంగా మారి రాకపోకలు సాగించడం కష్టంగా మారిందని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






