21-06-2025 12:00:00 AM
మందమర్రి, జూన్ 20 : సింగరేణి ప్రాంతంలో దివంగత జర్నలిస్ట్ మునీర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రెవల్యూషన్ యూత్ సభ్యులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రివల్యూషన్ యూత్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు అనిల్ భగత్, ఉపాధ్యక్షులు యండి అక్బర్, సభ్యులు పొట్నూరి వంశీకృష్ణ, వాసిం, మాజీ కౌన్సిలర్ సుధాకర్, శ్రీనాథ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.