21-06-2025 12:00:00 AM
నిర్మల్ జూన్ 20 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ టిఆర్ఎస్ సీనియర్ నేత సిహెచ్ హరీష్ కుమార్ కిడ్నాప్ కేసులో నిందితులను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. శుక్రవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఏఎస్పి రాకేష్ నీళ్లతో కలిసి వివరాలను వెల్లడించారు.
ఈనెల 14న అర్ధరాత్రి మామిడా మండలం పొన్కల్ గ్రామం లో ఉన్న హరీష్ రావు ఇంట్లోకి వెళ్లిన ప్రధాన సూత్రధారి షేక్ హైదర్ తో పాటు మరో ఐదుగురు కత్తులతో బెదిరించి హరీష్ రావును కిడ్నాప్ చేసి హైదరాబాద్ కు తరలించడం జరిగిందన్నారు. తమకు మూడు కోట్లు కావాలని నిందితులు డిమాండ్ చేయడంతో హరీష్ కుమార్ అంత ఇచ్చుకోలేనని 50 లక్షలు మాత్రమే ఇస్తానని చెప్పడంతో మిత్రుల ద్వారా డబ్బులు సర్దుబాటు చేస్తానని కిడ్నాపర్లతో నమ్మించారు.
తనకారులోని కాళ్లు చేతులు కట్టించి హైదరాబాద్ కు తీసుకెళ్తుండగా తూఫ్రాన్ వద్ద కట్టిన తాళ్లు విప్పాలని చెప్పడంతో వారు తాళ్లు ఇవ్వగానే టోల్ ప్లాజా వద్ద కారు డోర్ లో నుంచి దుంకి టోల్ ప్లాజా కు కేకలు వేస్తూ పరారయ్యారు. భయపడ్డ నిందితులు వేరే కారులో పారిపోయారు. అక్కడ పోలీసులను ఆశ్రయించిన హరీష్ కుమార్ జరిగిన సంఘటన వివరించి నిర్మల్ పోలీసుల రక్షణ కోసం సమాచారం ఇవ్వడంతో ఎస్పీ రాకేష్ ఆదేశాల మేరకు పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నట్టు తెలిపారు.
అయితే కిడ్నాప్ ప్రధాన సూత్రధారి అయిన మాజీ డ్రైవర్ షేక్ హైదర్ అదే గ్రామానికి చెందినవాడు కాగా హరీష్ కుమార్ వద్ద డబ్బులు ఉంటాయన్న ఆశతో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గుంటూరు కు చెందిన బాలల తట్టు రవి కలకంటి సురేష్ గూడెం కోటేశ్వరరావు కలిసి హరీష్ రావును కిడ్నాప్ చేసి మూడు కోట్లు డిమాండ్ చేయాలన్న పక్క ప్రణాళికతో ఈ కిడ్నాప్ చేసినట్టు నిందితులు తెలపడం జరిగింది అన్నారు.
ప్రధాన సూత్రధారైన షేక్ హైదర్ గతంలో వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, అక్రమ కలప రవాణా అక్రమ ఆవిధాల కొనుగోలు కేసుల్లో నిందితుడు కావడంతో తలను పోలీస్ పోలీసులకు ఇరికించేందుకు హరీష్ కుమార్ కుట్ర పన్నుతున్నారని అనుమానంతో ఆయనను కిడ్నాప్ చేసినందుకు ఈ కుట్ర చేశారన్నారు . హరీష్ కుమార్ ను కిడ్నాప్ చేసే సమయంలో ఐదుగురు వ్యక్తులు తలకు నల్ల మాస్కులు ధరించి కత్తులు ఇతర మరణాల సామగ్రిని ఉపయోగించి ఇంట్లో డబ్బుల కోసం వెతికిన ప్రయోజనం లేకపోయిందన్నారు.
అయితే అతని వద్దనే పనిచేసిన షేక్ హైదర్ డ్రైవర్ ను గుర్తించిన హరీష్ కుమార్ అతని వివరాలకు పోలీసులకు చెప్పడంతో జిల్లా ఎస్పీ ఈ కేసును సవాల్గా తీసుకొని ఏపీ రాకేష్ మీనా సిఐలు గోవర్ధన్ కృష్ణ ఎస్ఐలతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామ న్నారు. వీరు మొదటగా గుంటూరు విజయవాడ ప్రాంతంలో వెళ్లి తిరిగి ఇక్కడికి వస్తుండగా సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఎస్సైలు గోవర్ధన్ కృష్ణ ఆధ్వర్యంలో సాంకేతిక ఫోన్ కాల్ సాయం తో పట్టుకున్నామని తెలిపారు.
అయితే ఇతనికి పునకల్ గ్రామం చెందిన మధుసూదన్ కూడా ఇక్కడి పరిస్థితులను నిందితులకు వివరించడంతో ఆయనను కూడా అరెస్టు చేశామని, వారి వద్ద నుంచి రెండు ఫోన్లు 8 సెల్ ఫోన్లు నాలుగు కత్తులు బంగారం గొలుసు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. ఈమేరకు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించామని ఎస్పీ వివరించారు.
రాష్ట్రంలోని సంచలనకు మారిన ఈ కిడ్నాప్ కేసును జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకొని వారం రోజుల్లోనే నిందితులను పట్టుకుని అరెస్టు చేసిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. నేరానికి పాల్పడ్డ వారికి కఠినంగా శిక్షపడేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రధాన నిందితుడైన షేక్ హైదర్ భారతీయ జనతా పార్టీ మైనార్టీ సెల్ విభాగానికి అధ్యక్షుడని ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసులు సిబ్బంది తదితరులు ఉన్నారు.