14 April, 2026 | 5:20 PM

Breaking News

జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

డబుల్ బెడ్‌రూం సమస్యల పరిష్కారానికి ఎంపీకి వినతి

19-05-2025 12:00 AM

మేడ్చల్, మే 18(విజయ క్రాంతి): బాచుపల్లి డబుల్బెడ్ రూం సముదాయంలో సమస్యల పరిష్కానికి కృషి చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ను ఆదివారం మేడ్చల్ మున్సిపాలిటీ పూడూరులోని తన నివాస గృహంలో నివాసితులు కలిసి, వినతి పత్రం సమర్పించారు. బాచుపల్లిలో 10 బ్లాకుల్లో 1080 కుటుంబాలు ఉన్నాయన్నారు.   నీటి సరఫరా సౌకర్యం, బోరు లేని కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు.

ప్రహరీ లేని కారణంగా పాములు, విష పురుగుల నుంచి రక్షణ లేకుండా పోయిందన్నారు. శ్మశాన వాటిక లేదని, వేలాది మంది అక్కడి నివాసిస్తున్నా వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్త చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడికి తీసుకువచ్చి, డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు.

భూ సేకరణలో తక్కువ నష్ట పరిహారం

నాగ్ పూర్ - అమరావతి గ్రీన్ ఫీల్ హైవే నిర్మాణం కోసం చేస్తున్న భూసేకరణలో నిర్వాసితులకు ఇస్తున్న నష్టపరిహారం చాలా తక్కువ ఉందని వరంగల్ జిల్లా రైతులు ఎంపీ ఈటల రాజేందర్ను కలిసి వినతి ప త్రం సమర్పించారు. వాస్తవ విలువలో ఇర వై శాతం కూడా పరిహారం ఇవ్వడంలేదని, వాస్తవ ధరల ప్రకారం పరిహారం ఇస్తేనే భూ మి ఇస్తామన్నారు.  ఈ విషయాన్ని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేయాలని కోరారు.