24-06-2025 12:46:54 AM
సంగారెడ్డి, జూన్ 23 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2023, 2024, 2025 సంవత్సరానికి రావాల్సిన బకాయిలు రూ.200 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బకాయిలు ఉండడంతో తమ పిల్లలను యాజమాన్యం పాఠశాలకు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ హాస్టళ్లను తెరిపించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్, అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొండాపురం జగన్, పంబల దుర్గాప్రసాద్, పోతురాజు, యాదగిరి, సురేష్, కెవిపిఎస్ అశోక్, బోర్గి సంజీవ్, రవీందర్ నాయక్, దేవుజా, గార్మీయా నాయక్, సురేష్, మారుతీ, మంజుల, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.