15 April, 2026 | 12:30 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: డీఎస్పీ ప్రభాకర్

24-06-2025 12:45 AM

గీతం యూనివర్సిటీలో మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన

పటాన్ చెరు, జూన్ 23 :మాదక ద్రవ్యాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్ సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో జరిగే దుష్ప్రభావాలపై గీతం యూనివర్సిటీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీ అధ్యాపకులు, ప్రతినిధులు, పోలీస్ సిబ్బందితో, విద్యార్థులతో కలిసి  యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు వివరించారు. వీటి వినియోగంతో జీవితాలు, కుటుంబాలే నాశనం అవుతాయన్నారు. వాటి జోలికి వెళ్లకుండా చదువు, కెరీర్ వైపే దౠష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ వినాయకరెడ్డి, డీఐ రాజు, గీతం ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

బొల్లారం మున్సిపాలిటీలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో డ్రగ్స్ వినియోగంతో జరిగే చెడు పరిణామాల గురించి సీఐ రవీందర్ రెడ్డి విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. పోలీస్ సిబ్బంది, అధ్యాపకులు, ఉపాధ్యాయులుపాల్గొన్నారు.