15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సోలార్ మీటర్లు ఇవ్వాలని వినతి

18-02-2026 12:00 AM

మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి సూర్యా ఘర్ ముక్త్ బిజిలీ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ మీటర్లు అంద చేయాలని డి ఈ కి బిజెపి నాయకులు వినతి పత్రం సమర్పించారు. సోలార్ పవర్ ప్లాంట్లకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం టు వే మీటర్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని వారు పేర్కొన్నారు.

ఏడాది నుంచి మీటర్లు ఇవ్వకపోవడం విచారకరమన్నారు. మీటర్లు ఇవ్వకుంటే ఉద్యమం చేపడతామని వారు స్పష్టం చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో చేరుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, జాకాట ప్రేమ దాస్ తదితరులు ఉన్నారు.