16 June, 2026 | 12:10 PM

ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం

16-06-2026 11:01 AM

'ది ఆర్డర్ ఆఫ్ దివైట్ డబుల్ క్రాస్'

సారాంశం:
స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్’ను ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్నారు. భారత్-స్లోవేకియా సంబంధాల బలోపేతానికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. దీంతో మోదీకి లభించిన అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 33కు చేరుకుంది.

బ్రాటిస్లావా: ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం(Slovakia honours PM Modi) దక్కింది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో స్లోవేకియా మోదీని సత్కరించింది. స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని 'ది ఆర్డర్ ఆఫ్ దివైట్ డబుల్ క్రాస్'(the Order of the White Double Cross) మోదీని సత్కరించి అవార్డును ప్రదానం చేశారు. ఇప్పటి వరకు 33 అంతర్జాతీయ పురస్కారాలు(International Awards) దక్కించుకున్నారు.

దేశ, విదేశీ రాజకీయాలపై తాజా విశ్లేషణల కోసం విజయక్రాంతి న్యూస్ ను ఫాలో అవ్వండి.

ప్రధానిగా నరేంద్ర మోదీ 100 విదేశీ పర్యటనలు పూర్తి చేసి రికార్డు నమోదు చేశారు. ప్రధాని హాదాలో ఇప్పటి వరకు 78 దేశాలు సందర్శించారు. ఈ గౌరవాన్ని స్వీకరించిన అనంతరం కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పురస్కారం భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలదని మోదీ పేర్కొన్నారు. దీనిని భారత్-స్లోవేకియా దేశాల మధ్య ఉన్న చిరకాల స్నేహానికి అంకితం చేశారు.

మోదీకి ఇది 33వ అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషం. భారత్-స్లోవేకియా సంబంధాలకు ఇది కొత్త మైలురాయిగా భావిస్తున్నారు.

ఈ పర్యటన సందర్భంగా, రాష్ట్రపతి భవన్‌లో స్లోవాక్ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని(Slovak President Peter Pellegrini) మోదీకి స్వాగతం పలికారు. అక్కడ ఇద్దరు నాయకులు వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, వ్యూహాత్మక వ్యవహారాలు వంటి రంగాలలో సహకారాన్ని విస్తరించుకోవడంపై చర్చలు జరిపారు. మోదీ వెంట విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(External Affairs Minister S. Jaishankar), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. 2025లో స్లోవేకియాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన, ఈ ఏడాది ప్రారంభంలో భారత దేశంలో అధ్యక్షుడు పెల్లెగ్రిని పర్యటన వంటి రెండు దేశాల మధ్య జరిగిన వరుస ఉన్నత స్థాయి రాకపోకల అనంతరం మోదీ ఈ పర్యటన చేపట్టారు. 

ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, జాతీయ రాజకీయాలపై మరిన్ని కథనాల కోసం జాతీయ వార్తలు చూడండి.

మోదీకి లభించిన స్లోవేకియా పురస్కారం ఏమిటి?

స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్’ను ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. భారత్-స్లోవేకియా సంబంధాల బలోపేతానికి చేసిన కృషికి ఈ గౌరవం లభించింది.

FAQ's

1. మోదీకి ఏ పురస్కారం లభించింది?

స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్’ లభించింది.


2. మోదీకి ఇప్పటివరకు ఎన్ని అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి?

ఈ అవార్డుతో మొత్తం 33 అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.


3. ఈ అవార్డును ఎవరు ప్రదానం చేశారు?

స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ప్రదానం చేశారు.


4. మోదీ ఈ పురస్కారాన్ని ఎవరికి అంకితం చేశారు?

భారతదేశంలోని 140 కోట్ల ప్రజలకు మరియు భారత్-స్లోవేకియా స్నేహానికి అంకితం చేశారు.


5. ఈ పర్యటనలో ఏ అంశాలపై చర్చించారు?

వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చలు జరిగాయి.