4 July, 2026 | 9:51 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

బొగ్గు గనిలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

09-01-2025 01:12 AM

* ఒక మృతదేహం గుర్తింపు

* మరో ఎనిమిది మంది కోసం గాలింపు

దిస్‌పూర్, జనవరి 8: అసాంలోని ‘ర్యాట్ హోల్’ బొగ్గు గనిలో చిక్కుకున్న వారి కోసం భారత సైన్యం రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నది. గనిలో వరదల కారణంగా గాలింపు చర్యలు క్లిష్టతరంగా ఉన్నట్లు తెలిసింది. మంగళవారం మొత్తం తొమ్మిది మంది మైనర్లు గనిలో గల్లంతు కాగా, భారత సైన్యం ఇప్పటివరకు ఒక మైనర్ మృతదేహాన్ని గుర్తించింది.

ఆమెను నేపాల్‌కు చెందిన గంగా బహదూర్ శ్రేష్ఠోగా గుర్తించారు. గనిలో లోతు 300 అడుగులు ఉండగా, ప్రస్తుతం 100 మీటర్ల మేర నీరు ఉంది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో భారత సైన్యంతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు కూడా పాలుపంచుకుంటున్నాయి.