17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

వేగం పెంచిన రెస్క్యూ బృందాలు

28-03-2025 12:33 AM

ఎస్‌ఎల్‌బీసీలో కార్మికుల ఆనవాళ్ల కోసం జాగిలాలతో తనిఖీలు

నాగర్‌కర్నూల్, మార్చి 27 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయ టకు తీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. గురువారం సొరంగంలోని డేంజర్ జోన్ వద్ద దుర్వాసన మరింత పెరగడంతో కార్మికుల ఆనవాళ్లు దొరికే ఆస్కారం ఉన్నట్లు భావిస్తూ మరోసారి కేరళ జాగిలాలతో సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టారు. సహాయక చర్యలకు అడ్డుగా ఉం టున్న టీబీఎం యంత్రాలను థర్మల్ ప్లాస్మా కట్టర్ ద్వారా వేరు చేస్తూ లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపుతున్నారు. సొరంగంలో ఎనిమిది మంది చిక్కుకోగా రెండు మృతదేహాలను బయట కు తీశారు. మరో ఆరుగురి కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్‌లో వేగం పెంచారు. గురువారం ప్రతేక అధికారి శివశంకర్ లోతేటి సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.