23-06-2025 10:44:36 PM
కుభీర్: ఇటీవల ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన కుబీర్ మార్కెట్ కమిటీ(Kuber Market Committee) పాలకవర్గంలో లుకలుకలు కొనసాగుతున్నాయి. కాగా మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి(Former MLA Vittal Reddy) అనుచరుడైన గోనే కళ్యాణ్ కు చైర్మన్ పదవి దక్కడంతో అదే పార్టీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ మండల నాయకుడు వెన్నెల సతీష్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం నుండి సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ పార్టీలో కష్టకాలంలో జెండా మోసిన వారికి చైర్మన్ పదవిని కట్టబెట్టాలని ఇన్చార్జి మంత్రి సీతక్క, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీసీసీ అధ్యక్షులను ప్రతిసారి కలిసి వినతి పత్రాలను అందజేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అనుచరుడికి ఏంసి చైర్మన్ పదవిని కట్టబెట్టడం జీర్ణించుకోలేని వెన్నెల సతీష్ తన ప్రమేయం లేకుండా తనను డైరెక్టర్గా నియమించడం పట్ల సోమవారం తన డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తూ డీఎంవోకు అందజేశారు. దీంతో మండలంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు బట్టబయలైంది.